V1News Telangana

best news portal development company in india

జన్మదినం సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

SHARE:

కామారెడ్డి జిల్లా,
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు నసురుల్లాబాద్ మండల పరిధిలో గల నెమ్లి సాయిబాబా మందిరంలో మరియు పంచముఖ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు అర్చన కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ సింగ్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు నందు రెడ్డి, రామకృష్ణారెడ్డి , మాజీ జెడ్పిటిసి భాస్కర్ ,దుర్కి PACS చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పిటిసి కిషోర్ యాదవ్ ,అరిగె సాయిలు ,మంతపురి సాయా గౌడ్, సత్యనారాయణ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయన నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి బయలుదేరు వెళ్లారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india