రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రూ.90 నాణెం తయారు చేసింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక నాణేన్ని విడుదలచేశారు.
.ఈకార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన రూ.90 నాణెం 99.99 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. ఈ నాణెం బరువు 40 గ్రాములు.స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన ఈ 40 గ్రాముల నాణెం రూ. 90 ముఖ విలువతో RBI చిహ్నంగా ఉంటుంది. లోగో కింద RBI@90 అని రాసి ఉంది. అశోక స్తంభానికి నాలుగు సింహాల చిహ్నం ఉంది. దాని కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంది. ఈ రూ.90 నాణెం ఒక ప్రత్యేక రోజు జ్ఞాపకార్థం ముద్రించబడింది. ఇది ప్రజల వినియోగానికి అందుబాటులో ఉండే అవకాశం లేదు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....