Post Views: 62
¥రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామం లో ఎన్ఆర్జియస్ ఫండ్ కోటలో 10 లక్షల రూపాయల తో సులేమాన్ నగర్ ఎంపీటీసీ గౌస్ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు మరియు డ్రైనీజీ ల నిర్మాణం జరుగుతుంది. గత 10 సంవత్సరాలనుండి సులేమాన్ నగర్ గ్రామం లోని కొత్త అబాది ఏరియాలో ఇప్పటి వరకు డ్రైనీజీ వేయలేదని మురికి కాలువలో దుర్వసన వచ్చి తమ పిల్లలు అనారోగ్యం తో పడటం వలన ఆసుపత్రు లు తిరిగామనీ కొత్త అబాది ప్రజలు తెలిపారు.10 సంవత్సరాల తరువాత సులేమాన్ నగర్ ఎంపీటీసీ గౌస్ ఆధ్వర్యంలో డ్రైనేజి మరియు సీసీ రోడ్ల నిర్మాణం జరగడం పై సులేమాన్ నగర్ గ్రామస్థులు ఎంపీటీసీ గౌస్ ను అభినందిస్తున్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist