Post Views: 129
రాత్రిపూట జోరుగా ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు
తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుండి ఇసుక రవాణా..ఎజిగి ఖాజాపూర్ మీదగా రాత్రి సమయంలో వెళ్తున్న అక్రమ ఇసుక ట్రాక్టర్లు…
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి రాత్రి సమయంలో జెసిబి ద్వారా తవ్వకాలు జరుపుతూ అట్టి ఇసుకను తెలంగాణలో రాత్రి సమయంలో అమ్మకాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. ఇష్టానుసారం రాత్రి సమయంలో అక్రమ ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్న సంబంధ శాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని స్థానిక ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు అక్రమ ఇసుక రవాణా పై ఉక్కు పాదం మోపి రాత్రి సమయంలో నడుస్తున్న అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....