ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి – అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి -23:
జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ దంపతులు గోదావరిఖనిలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, తల్లుల చల్లని దీవెనలు భక్తులందరిపై ఉండాలని, జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జాతరలు నిర్వహిస్తారని, జిల్లాలో గోదావరిఖని జనగామ, సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని ఆయన తెలిపారు.అనంతరం జాతర నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ దంపతులకు శాలువాతో సత్కరించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట సంబంధిత దేవాదాయ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM