కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు ఆగిపోయినాయి
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్రావు బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు అడ్డుకట్టగా ఉన్నారు
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు ఆగడంలో వీరు ఇరువురి పాత్ర బాగా ఉంది..
ఈ పనులు ఆగిపోవడం వల్ల 20వేల ఎకరాల పంట పొలాల రైతులకు తీరని నష్టం కలుగుతుంది
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బాన్సువాడ ఇన్చార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి తమ వైఖరిని మార్చుకోవాలి
రైతులు
రైతు కిషన్ నాయక్
వర్ని,, సిద్దాపూర్
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతుందని, గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న రిజర్వాయర్ పనులు అర్ధాంతంగా ఆపేసి కాంట్రాక్టర్ ఉన్నఫలంగా చేతులెత్తేసి తన మిషనర్లను తీసుకొని వెళ్ళి పనులను ఎక్కడికి అక్కడే వదిలిపెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు అదే విధంగా కిషన్ నాయక్ అనే రైతు తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 సంవత్సరంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. సుమారు 20 వేలకు ఎకరాలకు పైగా ఉన్న రైతుల భూములు నీటి సౌకర్యం లేక బోర్లు వేస్తే భూగర్భ జలాలు అడుగంటి పోతున్న పరిస్థితి నెలకొంటుందని, నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని. వాటర్ సౌకర్యం లేక అదే విధంగా నిజాంసాగర్ కెనాల్ సౌకర్యం లేక, రైతులు పంటలు పండించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజన రైతులు తెలిపారు. సుమారు మూడు నుంచి నాలుగు చెరువులకు కలిపి అనేక గ్రామాలకు ఆనుకొని ఉన్న కొండలు, గుట్టల నుంచి వర్షపు నీరు వచ్చి ఈ చెరువులో చేరుతుందని అన్నారు. వర్షపు నీటితో ఈ చెరువులో నిండుతాయని అన్నారు. ఈ చెరువులకు కట్ట లేకపోవడంతో వర్షపు నీరు వృధాగా పోతుందని అన్నారు. సుమారు 1000 ఎకరాల్లో ఆవరించి ఉన్న చెరువులో నీరు వృధాగా పోవడం వల్ల రైతుల పంట పొలాలకు నీరు అందని ద్రాక్షగా మారిందని రైతులు తెలిపారు. చెరువులో ఉన్న నీరు వృధాగా పోవడంతో వేల ఎకరాల్లో పంటలు పండించని దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. గత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితో రెండువందల కోట్ల పది లక్షల రూపాయలతో, సిద్దాపూర్ పైడిమల్ గ్రామాలు అదేవిధంగా ఇతర గ్రామాలు కలుపుకొని సిద్దాపూర్ రిజర్వాయర్ 3 కిలోమీటర్ల కట్ట నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఒక్క కిలోమీటర్ వరకు కట్ట నిర్మించడం జరిగిందని అన్నారు. మరో రెండు కిలోమీటర్ల కట్ట నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం మారిపోవడం ,ప్రస్తుత ప్రభుత్వం రావడం వల్ల కాంట్రాక్టర్ చేతులెత్తి వెళ్లిపోవడం జరిగిందని ,బడ్జెట్ ప్రాబ్లం అవుతుందని ,బడ్జెట్ రాదని ఉద్దేశంతో కాంట్రాక్టర్ మిషన్లన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందని ,ఆయన వెళ్లిపోవడం వల్ల ,ఆయన నిర్లక్ష్యం ఫలితం ,రైతుల పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ గత రెండు నెలల నుంచి మిషనరీలను తీసుకొని వెళ్లిపోవడం జరిగిందని అప్పట్నుంచి పనులు బంద్ ఉన్నాయని అన్నారు అదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం మారిందని తమకు బడ్జెట్ ప్రాబ్లం అవుతుందని అదేవిధంగా మట్టి కూడా ది నియోజకవర్గమైన నాగులూర్ గ్రామం నుంచి తేనె ఇవ్వడం లేదని, మట్టి తీయకుండా ఆపివేస్తున్నారని , దీంతో పనులు ఆపివేసిన పరిస్థితి ఏర్పడుతుందని కాంట్రాక్టర్ తమకు తెలిపినట్టు రైతులు తెలిపారు. గత రెండు సంవత్సరాల నుంచి పనులు కొనసాగించడం వల్ల ఒక కిలోమీటర్ వరకు కట్ట నిర్మాణం చేయడం జరిగిందని, ఈ ఒక్క కిలోమీటర్ కట్ట నిర్మాణం చేయడం వల్ల ,నీరు ఆగుతుందని, దీనివల్ల బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతుందని, పంటపొలాలకు మేలు కలుగుతుందని రైతులు తెలిపారు. ప్రస్తుతం ఒక కొండ మధ్యలో నుంచి ఈ కట్ట నిర్మాణం చేయాల్సి ఉందని ఆ పనులు పూర్తి అయ్యే దశలో ప్రభుత్వం మారడం వల్ల కాంట్రాక్టర్ చేతులెత్తి వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు. కాంట్రాక్టర్ వెళ్లిపోవడంతో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మళ్లీ ఆ పనులు ప్రారంభించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలని రైతులు కోరుతున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్దకు అనేకమార్లు రైతులు వెళ్లి తమ గోడును విన్నవించగా ఆయన పలుసార్లు సంబంధిత శాఖ అధికారులకు మిగతా వారికి చెప్పిన ఎవరు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్రావు
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రెడ్డి తమ తీరు మార్చుకోవాలి
వారి ఇరువురి వల్లనే సిద్దాపూర్ రిజర్వ్ పనులు ఆగిపోయాయి
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు వారు అడ్డంకిగా మారారు
వారి ఇద్దరి నిర్లక్ష్య ఫలితం వేల ఎకరాలకు చెందిన గిరిజన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన రైతులపై కనికరించాలి
ఎల్లారెడ్డి నియోజకవర్గమైన నాగులూరు గ్రామం నుంచి సిద్దాపూర్ రిజర్వాయర్ కు మట్టి తరలించడం జరుగుతుందని. ఈ రిజర్వాయర్ మరమ్మత్ లో భాగంగా, మట్టిని నాగులూర్ గ్రామం నుంచి తేనివ్వకుండా ,ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అడ్డుకుంటున్నారని. ఆయనతోపాటు బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి కూడా ఆపివేస్తున్నారని. వారి ఇద్దరి నిర్లక్ష్య ఫలితం, వేల ఎకరాలకు చెందిన గిరిజన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ,గిరిజన రైతులతోపాటు కిషన్ నాయక్ అనే రైతు తమ గోడును మీడియాకు వెల్లడించారు. ఇప్పటికైనా వీరు ఇరువురి తీరు మార్చుకోవాలని వీరి నిర్లక్ష్య ఫలితం వీరి యొక్క అలసత్వ ఫలితం, స్వార్థ రాజకీయం కోసం పనులు అడ్డగించడం వల్ల గిరిజన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజన రైతుల పాలిట వీరు ఇరువురు శాపంగా మారుతున్నారని వారు పేర్కొన్నారు. వేల ఎకరాలకు చెందిన రైతుల గోడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి, వారు ఇరువురి తీరుపై దృష్టి పెట్టి, మాకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....