నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు తీరు బహు పరాక్
పోలీసులకు చెబితే ఏం పీకుతారు
ఆస్పత్రిలో వైద్యులు తీరు ఘోరంగా ఉంది
వెంటిలేటర్ పెట్టగానే చనిపోతున్నారు ఇప్పటికీ పదుల సంఖ్యలో చనిపోయారు, సంతకం పెట్టమని ఇబ్బంది పాలు చేస్తున్నారు
మా నాన్నకు వెంటిలేటర్ పెట్టలేదు పెట్టించలేదు సంతకం కూడా చేయలేదు అందుకే మా నాన్న బతికి ఉన్నాడు
ఆయన కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉంది
అక్కడ పరిస్థితి చూసి బాగు లేక తన తండ్రి సీరియస్ గా ఉన్న ఇంటికి తీసుకువచ్చాను భయపడి
ట్రీట్మెంట్ లేదు, సరైన రెస్పాన్స్ లేదు ,ఈసడించి మాట్లాడడం ,తిట్ల పురాణం చేయడం చాలా బాధగా ఉంది నేను ట్రీట్మెంట్ అందకపోవడంతో, డాక్టర్ ఇష్టానుసారంగా తిట్ల పురాణం చేయడంతో మనసు బాధనిపించి సీరియస్గా ఉన్న తన తండ్రిని ఇంటికి తీసుకు వచ్చాను ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది మా తండ్రిది..
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాకు గత కొద్ది రోజులు అక్కడ ట్రీట్మెంట్ కోసం మా తండ్రిని తీసుకెళ్లగా జరిగిన పరాభద్భావాలు ఇవి నాకు
రిపోర్టర్ గా ఒక ఛానల్ కు ఒక ఎండిగా ఉన్న తనకే ఇలాంటి అనుభవం జరిగినప్పుడు సామాన్య మానవులు మధ్యతరగతి మానవుల పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉందో అర్ధం అవుతుంది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిజాంబాద్ లో
ఈ విషయం వార్త ప్రచురితమైతే
నామమాత్రంగా ఎంక్వయిరీ కి వచ్చి ముందస్తుగానే ఎంక్వయిరీ కి వస్తున్నామని సమాచారం ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం
వి వన్ ఛానల్ ఎండి శ్రీనివాస్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి అద్వానంగా మారిందని అక్కడ ట్రీట్మెంట్ నచ్చకపోవడంతో ఇంటికి వచ్చి నాన హైరానాపడి ఏమి చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉన్న ఓ వ్యక్తి తన గోడును ఈ విధంగా విన్నవించడం జరిగింది. వారం రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో తన తండ్రిని సీరియస్ కండిషన్లో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా జాయిన్ అవ్వగానే సరైన ట్రీట్మెంట్ అందలేదని. ట్రీట్మెంట్ కోసం పెద్ద ,పెద్దలకు ఫోన్ ద్వారా సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ ఛానల్ కు సంబంధించిన ఎండి శ్రీనివాస్ పెండేకర్ తన గోడును తెలియజేశారు. అయినప్పటికీ కొంతసేపు ట్రీట్మెంట్ మంచిగా అందించినట్టు చేసి మళ్లీ యధా రాజా తథా ప్రభ అన్న చందంగా సిబ్బంది ,వైద్యులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. తన తండ్రి సీరియస్ ఉండడంతో మొట్టమొదటిసారిగా తనకు ఒక ఫైల్ మీద సంతకం చేయమన్నారని ,నేను చేయలేదని వెంటి లెటర్ పెడతా అని అంటే నేను పెట్టనీయలేదని పేర్కొన్నారు. నా పక్కనే పదుల సంఖ్యలో సంతకం పెట్టించుకుని వెండి లెటర్ పెట్టగానే చనిపోవడం జరిగిందని పేర్కొన్నారు. తన తండ్రి కి వెంటిలేటర్ పెట్టకపోవడంతో తన తండ్రి బతికి ఉన్నాడని పేర్కొన్నారు. వెంటి లెటర్ పెట్టడం వెనుక అదే విధంగా ఫైల్ పై సంతకం పెట్టడం వెనుక అంతర్యం ఏమిటని ఆయనకు పలు అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వెంటిలేటర్ పెట్టగానే పదుల సంఖ్యలో ఎందుకు మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు సంతకం పెట్టించుకుని, వెంటిలేటర్ పెట్టడం వెనుక కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. తన యొక్క మాతృమూర్తి కి ఒక వైద్యుడు వచ్చి ఇష్టానుసారంగా బూతు పదజాలంతో తిట్టడం జరిగిందని పేర్కొన్నారు . సరైన సౌకర్యాలు లేవని అరకరా సౌకర్ల మధ్య చికిత్సలు అందించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు . అక్కడ ట్రీట్మెంట్ నచ్చకపోవడంతో తన తండ్రి పరిస్థితి బాగు లేకున్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రి పోలేక అక్కడ డబ్బులు పెట్టే స్తోమత లేక ఏమి చేయాలో తోచని పరిస్థితిలో కండిషన్ బాగు లేనప్పటికీ ,తన తండ్రికి ఇంటికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్సలో భాగంగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ వచ్చి పోలీసులకు చెబితే ఏమైతది ఏం పీకుతారు అనే దుర్భాష పదజాలతో దూషించడం జరిగిందని ఇవన్నీ భరించలేక తన తండ్రిని సీరియస్ కండిషన్ ఉన్నప్పటికీ ఇంటికి తీసుకు వచ్చా అని పేర్కొన్నారు. తన తండ్రికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని వాపోయారు. తాను తన తండ్రిని ఇంటికి తీసుకుని రాగానే ఫోన్ ల ద్వారా వైద్యులు కొంతమంది మళ్లీ మీరు నిజాంబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి రమ్మని మంచి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పడం తనకు బాధగా ఉందని, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు సరిగా చికిత్సలు ఇవ్వనివారు, తర్వాత ఇంటికి రాగానే సారీ చెప్పడం, మంచి ట్రీట్మెంట్ అందిస్తామని ఫోన్ ద్వారా సంప్రదించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి దూరా ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగుల పరిస్థితి వారి వెంట వచ్చిన బంధువుల పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం మారిందని అక్కడున్న ఓ చక్రం తిప్పుతున్న ప్రధాన పాత్రధారులై ఉన్న వారిపై వేటు ఎందుకు వేయటం లేదని ఆయన ఆరోపించారు. అక్కడ కొన్ని విషయాలపై సోషల్ మీడియా పేపర్ ద్వారా వార్త వచ్చినప్పుడు, ఎంక్వయిరీ కోసం వచ్చిన అధికారులు నామ మాత్రంగా వచ్చి ఎంక్వయిరీ చేశారని. ఎంక్వైరీ వచ్చేముందు వారికి ఫోన్ చేసి వచ్చారని, చివరికి ఎంక్వయిరీ ఆఫీసర్లు కూడా ఆసుపత్రి వారితో మూలాఖత్ ఐ అమన్యాలకు ఆశపడి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెనుకంజ వేయడం సిగ్గుచేటని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రిలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు వివరాలు, విషయాలు బయటికి రాకుండా , కప్పిపుచ్చడం చాలా దారుణమని మండిపడ్డారు. సీనియర్ డాక్టర్లు మాత్రం కనిపించబోరని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోతారని, ఒక్కొక్కసారి వస్తే వస్తారని లేకపోతే రారని అంతా వారి ఇష్టమేనని, వారికి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులపై అధిక ప్రాధాన్యత ఇస్తారు తప్ప , ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండబోరని ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్లు మాత్రమే చూస్తారని ట్రైనీ డాక్టర్ల కోసమే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కొన్ని సమయాల లో రోగులు ప్రాణాల మీద తెచ్చుకొని బలి ఆవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటన జరగకుండా, చూడాలని ఆయన కోరారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....