V1News Telangana

రేపటినుండి ఒరిజనల్ గుర్తింపు కార్డు ఉంటేనే జీరో టికెట్: ఆర్టీసీ ఎండి సజ్జనార్ ..

*తెలంగాణలోని కొన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో ఆర్టీసీ ఎండి సజ్జనార్ బుధవారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడు తూ. ఉచిత బస్ ప్రయాణ సౌక ర్యానికి మంచి స్పందన వస్తోంది.ఈ పథకాన్ని మహి ళలు,బాలి కలు, విద్యార్థిను లు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తు న ఉపయోగించుకుంటు న్నారు.

కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకు రావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నా రని, స్మార్ట్ ఫోన్‌లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నాం.

ఫొటో కాపీలలు స్మార్ట్ ఫోన్ల లో చూపిస్తే ఉచిత ప్రయా ణానికి అను మతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటో లు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డు ల్లో చిన్నతనం నాటి ఫొటో లు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలి.అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

అతి తక్కువ టైంలోనే ఈ స్కీంను అర్థం చేసుకుని.. చాలా చిత్తశుద్ధితో సమర్థ వంతంగా ఈ స్కీంను విజ యవంతంగా అమలు చేస్తో న్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు.

ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ మర్యాదపూ ర్వకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యం గా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకో వాలని కోరారు. జీరో టికెట్‌ను జారీ చేస్తేనే ఆ చార్జీని టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు పేర్కొ న్నారు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని చెప్పారు.

ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికా దని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు.

*త్వరలో 2050 కొత్త బస్సులు*

ప్రయాణికుల రద్దీకి అను గుణంగా కొత్త బస్సు లను అందుబాటు లోకి తీసు కురావాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయిం చింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందు బాటులోకి వచ్చే ప్లాన్ చేస్తు న్నాం.

అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. విడతల వారీగా ఆ బస్సులు వాడ కంలోకి వస్తాయి.అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?