ఇటుక భట్టిలలో మగ్గుతున్న బాల్యం
ఇటుకల తయారీలో కొండలలో, గుట్టలలో, అటువీశాఖ ,రెవిన్యూ శాఖ, ప్రభుత్వ శాఖ భూముల నుంచి మొరం, ఎర్ర మట్టి జోరుగా త్రవ్వకాలు
ఇటుక బట్టి యజమానులు మహారాష్ట్ర బీహార్ ఇతర రాష్ట్రాల కూలీలకు శ్రమదోపిడి చేస్తున్నారు
వ్యవసాయ భూములు అటవీ శాఖ ప్రభుత్వ భూములలో ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న విలువైన కలప ధ్వంసం, ఇటుక బట్టి తయారీ లో విలువైన కలప తరలింపు
ఉమ్మడి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్క గ్రామాలు వర్ని మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాలు ,రుద్రూరు మండలంలోని చుట్టుపక్క గ్రామాలు , మోస్రా మండల కేంద్రంతో పాటు చందూరు మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మండలం తో పాటు పలు గ్రామాల్లో జోరుగా అనుమతులు లేకుండా అక్రమ ఇటుక బట్టీల నిర్వహణ
ఇటుక బట్టి తయారీలో ,నిర్వహణలో దొంగ కరెంటు వాడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలు నిజామాబాద్
కొంతమంది అక్రమ దారులు ప్రకృతి వనరులు హరింపచేసి దోచేస్తున్నారు, ఈజీగా డబ్బులు సంపదల కోసం ప్రకృతి వనరులపై కన్నేస్తున్నారు, ఈ విధంగా కన్ను వేసిన వారు ఒక పార్టీకి అందుబాటులో ఉండి ,రన్నింగ్ పార్టీలో అందుబాటులో ఉండి వారికి అనుకూలంగా ఉండి, ఇక కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు మచ్చిక చేసుకుని వారికి మామూలు ఇస్తూ కొంతమంది ఇటుక బట్టీల తయారీని ఒక వృత్తిగా మార్చుకున్నారు, ఏళ్ల నుంచి ఇటుక బట్టి తయారీ వారి వృత్తిగా మార్చుకొని ప్రకృతి వనరులను హరింప చేస్తూ, దొంగలింప చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, ఇదే ధోరణి మళ్ళీ కొనసాగితే భూసారం నిస్సారవంతంగా మారి భావితరాల వారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. అక్రమ దారులు , ఏ పార్టీ రన్నింగ్ ఉంటే ఆ పార్టీ అండదండలు తీసుకుంటూ ఆ పార్టీలో జాయిన్ అన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఇసుక మాఫియా మొరం మాఫియా, పిడిఎఫ్ బియ్యం మాఫియా తో పాటు, కొండలు , గుట్టలు ప్రధాన రహదారి పక్కనే ఉండే చెట్లు, వ్యవసాయ భూములలో ఉండే విలువైన కలపను ధ్వంసం చేస్తూ, వాటితో వ్యాపారం, ఇటుక బట్టీల తయారీలో పొట్టును రైస్ మిల్లు నుంచి తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. అధిక లోడుతో పొట్టును వివిధ రాష్ట్రాలకు సరఫరా చెక్పోస్టులు వివిధ శాఖలకు చెందిన అధికారులకు మామూలు ఇస్తూ, పొట్టు వ్యాపారస్తులు, పొట్టు ను తరలించేవారు ,వాహనాల యజమానులంతా ఒక ముఠాగా ఏర్పడి, వ్యాపారం జోరుగా సాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి .ఈ పొట్టు తరలింపు వల్ల వివిధ వాహనదారులకు , ప్రధాన రహదారి గుండా ఉండే ప్రయాణికులకు పొట్టు కలలో పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడుతుందని, వీటివల్ల ప్రధాన రహదారి గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా అనేక రకాలుగా అక్రమ దారులు, అక్రమ వ్యాపారం చేస్తూ, వారి వారి వ్యాపారని మూడు పువ్వులు ఆరుకాయలుగా చేసుకుంటున్నారు అనేది విమర్శలు, ఇక వీరి యొక్క అక్రమ వ్యాపారాలు రెండో నంబర్ దందాకు ఎవరు అడ్డు అదుపు రాకుండా, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు మామూలు ఇస్తూ, వారి యొక్క వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు అనేది విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటుక బట్టీల తయారీ గురించి తీసుకున్నట్లయితే వర్ని మండలంలోని హుమ్నాపూర్ గ్రామం తో పాటు ఘన్పూర్ గ్రామంలో ఇటుక భట్టిల తయారీ జోరుగా కొనసాగడంతో పాటు, జాకోర గ్రామంలో ఇటుక బట్టీల తయారీ, చందూర్ మండలం లక్ష్మాపూర్, సైదుపూర్, కారేగం తండా గ్రామంలో ఇటుక బట్టీల తయారీ, గోవూరు గ్రామంలో, బోధన్ మండలంలోని అనేక గ్రామాల్లో, కోటగిరి మండలంలోని ఎత్తుండ క్యాంప్ గ్రామం తో పాటు అనేక గ్రామాల్లో, కోటగిరి మండలం రాంపూర్ గ్రామ శివారులో అనేక ఇటుక బట్టిలు రుద్రూర్ మండలం కుందాపూర్ గ్రామంలో అనేక ఇటుక భట్టిన నిర్వహణ , రుద్రూర్ మండలం కుందాపూర్ గ్రామంలో, సులేమాన్ ఫారం గ్రామం తో పాటు రాయకుర్ గ్రామ శివారు ప్రాంతంలో, అనేక ఇటుక భట్టిలను, ఇటుక భట్టి అక్రమ దారులు నిర్వహిస్తున్నారని, ఇటుక బట్టీల తయారీ కోసం కొండలు, గుట్టలు, ప్రభుత్వ స్థలాలు అటవీ శాఖ భూముల నుంచి మొరంతో పాటు, ఎర్రమట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా మిషన్ల ద్వారా జెసిబిల ద్వారా టిప్పర్ల ద్వారా తవ్వకాలు ,తరలింపు చేస్తూ ఇటుక భట్టిల వద్ద మట్టిని మొరం ను నిల్వ ఉంచుకొని వాటి ద్వారా ఇటుకలు తయారు చేస్తున్నారు, ఇటుక భట్టిలా నిర్వహణ కోసం అటవీ ప్రాంతం వ్యవసాయ భూములు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే విలువైన కలపలను ధ్వంసం చేసి, వాటిని ఉపయోగిస్తున్నారని విలువైన కలపను నరికి వాటిని విక్రయాలు చేసే కలప స్మగ్లర్లు కూడా ఒక ముఠాగా ఏర్పడ్డారని, ఇటుక భట్టిల నిర్వహణ కోసం రైస్మిల్ నుంచి ప్రత్యేక వాహనాల్లో అధికలోడుతో పొట్టును తరలించడంతో పాటు, పొత్తంగల్ చెక్పోస్ట్ బోధన్ చెక్పోస్ట్ తో పాటు వివిధ చెక్పోస్ట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా పొట్టును అక్రమంగా పగలు రాత్రి తేడా లేకుండా పొట్టు లారీల యజమానులు ఒక ముఠాగా ఏర్పడి తరలిస్తున్నారని వారి అక్రమ రవాణాకు ఎవరు అడ్డు రాకుండా కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులకు వారం లేదా నెలసరి మామూలు ఇస్తూ వారి దందాను జోరుగా కొనసాగించుకుంటున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటుక బట్టీల తయారీలో భాగంగా విద్యుత్ను దొంగలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం మహారాష్ట్ర తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు రప్పించి శ్రమదోపిడికి గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటుకల తయారీలో బాల కార్మికులు పనిచేస్తున్నారని బాల కార్మికులతో చలిచాలని వెతనమిస్తూ శ్రమ దోపిడీ గుర్తిస్తూ వారితో పనులు చేయించుకుంటున్న వైనం పలువురికి నీవేనపరుస్తుంది. పలక, బలపం పట్టుకుని చదువుకు దూరమై ఇటుక బట్టీలలోనే బాల్యం మగ్గుతుంది. ఇటుక బట్టీల నిర్వహణ చేసేవారు వివిధ శాఖలకు చెందిన అధికారులకు భారీగా మామూలు ఇస్తూ అక్రమ ఇటుక భట్టిలు నిర్వహిస్తూ ఇటుక అవసరం ఉన్నవారికి అధిక రెట్లకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారులు చూచి చున్నట్టు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ మామూలు మత్తులో ములుగుతున్న వారు ఇప్పటికైనా మేలుకోవాలని, ప్రకృతి వనరులను హరింపచేసి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ భావితరాల వారికి ముప్పు వాటిల్లే ప్రమాదం కల్పించే వారిపై చర్యలు తీసుకొని ప్రకృతి వనరులను, ప్రకృతి సంపదలు కాపాడాలని ప్రజలు కోరుతుండ్రు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....