మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి
షకీల్ అమీర్ ఆయన అనుచరులతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ ఆస్తులు దొంగలించి , పలు వస్తువుల తోపాటు సామాగ్రిని ధ్వంసం చేశారు
మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆయన అనుచరులపై దొంగతనంతో పాటు ఇతర కేసులు బుక్ చేయాలి లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాం
గత పది సంవత్సరాల నుంచి అరాచకాలు సృ
పోలీస్ స్టేషన్ ఎదుట రెండు పార్టీల మధ్య భాయి భాయి
టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
కాంగ్రెస్ పార్టీ గుండాయిజం రౌడిజం నశించాలంటూ నిరసన
కాంగ్రెస్ పార్టీ గుండాయిజం పరిపాలన కొనసాగిస్తుందని నిరసన కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు…
బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు ఘర్షణ పడడానికి సన్నద్ధం కాగా పోలీసులు వచ్చి ఇరు పార్టీల వారిని సముదాయించి ఆందోళన కారులను తరిమివేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పార్టీకి చెందినవారు అదేవిధంగా అనుచరులు వచ్చి ఫర్నిచర్ దొంగలించి తీసుకొని వెళ్ళిపోతున్నారని అదేవిధంగా ఉన్న ఫర్నిచర్ తో పాటు లైటింగ్ ఇతర వస్తువులను అదేవిధంగా బిల్లింగ్ ను కూడా ధ్వంసం చేశారని, సుమారు పది లక్షల వరకు వాహనాలలో సామాన్లు తీసుకువెళ్లారని చివరి డీసీఎం ను తాము అడ్డుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు , డీసీఎం లో క్యాంప్ ఆఫీస్ నుంచి సామాన్లు, ఇతర సామాగ్రి తరలిస్తున్న వారిని అడ్డుకొని వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంప్ ఆఫీస్ వద్ద వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, టిఆర్ఎస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వేదం జరిగింది ఒకరికొకరు ఘర్షణ పడటానికి సన్నద్ధమయ్యారు ఈ సందర్భంగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరు పార్టీల వారిని సముదాయించి ఎక్కడికి, అక్కడ తరిమి వేశారు దీంతో ఆందోళన కొంతవరకు తగ్గింది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద చాలాసేపటి వరకు ఘర్షణహితమైన వాతావరణం నెలకొంది వాహనాలు రాకపోకలకు ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, ఇరు పార్టీల మధ్య జరుగుతున్న జగడా చూసి పలువురు భయాందోళనకు గురయ్యారు. మస్తు సేపు ఆందోళన ఇరు పార్టీల మధ్య జరగడంతో పలువురు ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ఈ విధంగా ఘర్షణ చేసుకోవడం వాగ్వేదం చేసుకోవడం ,నువ్వెంత నేనింత అనుకొని ఒకరికొకరు దూషణ చేసుకోవడం, ప్రజా పాలనపై దృష్టి పెట్టాల్సి ఉండగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉండగా ఒకరికొకరు భాయి భాయి అనుకుంటూ, ఆధిపత్య పోరు కోసం రోడ్లపై ఒకరికొకరు కొట్లాటకు రంగం సిద్ధం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని పలువురు అసహనం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు, , వీరి తీరుపై ప్రజలు అసహన పరిస్థితులను వ్యక్తం చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా కౌన్సిలర్ శరత్ రెడ్డి తో పాటు పలువురు మాట్లాడుతూ బోధన్ ప్రజలు విసిగించిపోయి ఆయనకు ఓటమి చేసి మంచి తీర్పు ఇచ్చారని తెలిపారు, అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గకుండా ఇది ఎంతవరకు సమంజసమని ఆయన, ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న సుమారు 10 లక్షల వరకు సామాగ్రిని అనుచరులు తరలించడం జరిగిందని చివరి డీసీఎం తమ కార్యకర్తలు పట్టుకోవడం జరిగిందని, అప్పుడు వారి దొంగతనం బయటపడిందని అన్నారు సామాగ్రి దొంగలించడంతోపాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న వైరింగ్ తో పాటు ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి అదే విధంగా వస్తువులను డామేజ్ చేయడమే కాకుండా క్యాంప్ ఆఫీస్ గోడలను సైతం ధ్వంసం చేశారని ఇంతటి ఘోరం చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అనుచరులు వచ్చి ఈ విధంగా విధ్వంసం సృష్టించడం . రెవెన్యూ అధికారులకు విషయం గురించి చెబితే తమకు ఏమీ తెలవదని తప్పించుకున్నారని అదే విధంగా రెవెన్యూ అధికారులు చెబితే వారు కూడా మాకు ఏమో తెలియదని ఒకరిపై ఒకరు వేసుకొని నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంప్ ఆఫీస్ ను కాపాడాల్సిన రెవిన్యూ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక అసాంఘిక కార్యక్రమాలు చేశారని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చారని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బూతు వస్తువులు, అసాంఘిక కార్యక్రమాల సంబంధించిన సామాగ్రి కనిపించడం సిగ్గుచేటని
అసలు కొంతమంది ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది పోలీస్ స్టేషన్ ఎదుట కొన్ని పార్టీల వారు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్స్టేషన్ ఎదుట నిరసన చేశారు కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ గుండాయిజం రౌడీయిజం పెరిగిపోయిందని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి టిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్ నుంచి శాంతింప చేసి తరలింప చేశారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఎన్నికల ముగిసిన కొద్ది రోజులకే ఈ విధంగా ఘర్షణ చేసుకోవడం వాగ్వాదం చేసుకోవడం ఘర్షణ అయిత వాతావరణం నెలకొల్పడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల సమస్యల మీద ప్రజా, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన పరిపాలనపై దృష్టి పెట్టాల్సిన పెద్ద మనుషులు అదేవిధంగా నాయకులు ఈ విధంగా నువ్వంటే నువ్వు ఎవరి ఆధిపత్య పోరును వారు తేల్చుకోవడం భాయి భాయి అనుకుంటూ ఉంటే ఎలా అంటూ పలువురు ప్రశ్నించుకుంటున్నారు.
బోధన్ పట్టణంలో ఇరు పార్టీల మధ్య జరుగుతున్న ఘర్షణ ఇంకా ఎన్ని పవంచనియా సంఘటనలకు గురిచేస్తుందో ఎదురుచూడాల్సిందని పలువు భావిస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....