*తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే*
*మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్*
నిర్మల్,నవంబర్ 20(వి1 న్యూస్ తెలుగు): తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్ అన్నారు,సోమవారం రాత్రి ముధోల్ నియోజకవర్గంలోని తానూర్ మండల కేంద్రంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణరావు పటేల్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ జోడోయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారన్నారు,రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వెల్లడించారు,ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు, కార్మికులు,కర్షకులు,దళితులు,బడుగు బలహీన వర్గాలు,మైనారిటీ వర్గాల అభ్యున్నతికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలతోపాటు మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు,మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్పిస్తామన్నారు,నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చిందని తెలిపారు, దేశంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న విషయాన్ని మరవకూడదన్నారు,పేదల సొంతింటి కలను సహకారం చేయడంలో భాగంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి రూ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భోస్లే నారాయణ రావు పటేల్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి తనను ఒక్క సారి ఆశీర్వాదించి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా నని అన్నారు,కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ రావు పటేల్,అడ్వికెట్ భీమ్ రావు వన్నేకర్,నేషల్ ఫూడ్ కార్పోరేషన్ కౌన్సిల్ మెంబర్ సమత సుదర్శన్,శంకర్ చంద్రే,ఎంఏ లతీఫ్,ఓం ప్రకాష్ లడ్డ,కాంగ్రెస్ పార్టీ తానూర్ మండల ఇంచార్జీ జాదవ్ మాధవరావు పటేల్,
సోసైటి డైరెక్టర్ హెచ్.పుండ్లిక్,
కోలూర్ మాజి సర్పంచ్ మాధవరావు పటేల్,దత్తూరాం పటేల్,సదాశివ పటేల్,ఛోటే ఖాన్,మౌల,అంబాదాస్ పవార్,
అశోక్,ఫూర్ఖాన్,సత్తార్,బోల్సా
ఉపసర్పంచ్ జెవారే భీమ్ రావు,కాంగ్రెస్ పార్టీ
నాయకులు,కార్యకర్తలు,
అభిమానులు,తదితరులు, పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....