Post Views: 61
రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో గల సీసీ కెమెరాలు ఎన్నో సంవత్సరాలుగా పనిచేయకపోవడం వలన బస్టాండ్ ప్రాంగణంలో గత కొన్ని నెలలుగా చోరీలు ఎక్కువ మోతాదులో జరిగాయి. బస్టాండ్ ప్రాంగణంలో గల షాపు యజమానుల బాధలను గ్రహించి దొంగతనాలు జరగకుండా రుద్రూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నీలేష్ తన సొంత ఖర్చులతో బస్టాండ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శభాష్ పోలీస్ వ్యవస్థ అన్నట్టు పేరు పొందారు. ఇలాగే అధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజలకు న్యాయం కల్పించే దిశగా పనిచేయాలని అధికారులు న్యాయంగా పనిచేస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని రుద్రూర్ మండల ప్రజలు తెలిపారు.

Author: IRFAN Reporter
Work from as a journalist