Post Views: 133
పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరుతున్న యువకులు…
రుద్రూర్ V1న్యూస్ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డ్ మెంబర్, కార్యకర్తలు గత మూడు రోజుల కింద ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే అయితే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, నాయకుల తీరు నచ్చక తిరిగి ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నారోజీ గంగారాం, కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఆరీఫ్, అబ్దుల్ రావ్, అక్తర్, హైదర్, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Author: Thatipamula Rajashekhar
PRESS