500 మంది ఎస్ఎస్ యూత్ టీం యువ సమ్మేళనం బూతు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మాట్లాడిన సోమారపు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 18:-
శనివారం గౌతమ్ నగర్ సోమారపు సత్యనారాయణ గృహంలో రామగుండం నియోజకవర్గ సోమారపు సత్యనారాయణ ఎస్ఎస్ యూత్ టీం యువ సమ్మేళనం బూతు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ మన రామగుండము ని అభివృుద్ది చేసాను అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజి నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే నా హయాంలోనే,శాంక్షన్ చేపించనని కొందరు మేమె చెపించమని గొప్పలు చెప్పుకుంటున్నారు అది అబ్బడమని తెలిపారు ,అదేవిధంగా గోదావరి నదిని కలుషితం చేసారని మురుగునీరు, వస్తుందని మళ్ళీ నేను గెలిచాక గంగమ్మ తల్లిని శుద్ధి చూపించి స్వచ్ఛమైన మంచి నీరు 24 గంటలు అందిస్తానని తెలిపారు,అదేవిదంగా అర్ ఎఫ్ సి ఎల్ కూడా రావడానికి నేను కూడా ప్రధానమంత్రులతో మాట్లాడి ఒప్పించానని తెలిపారు,ఆలోచించండి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయ్,ఇపుడు ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థి గురించి మీకు తెలుసు ఏ పనిచెసిన కమిషన్లను తీసుకొని డబ్బులు సంపాదించడం తప్ప ఈ ప్రాంత ప్రజల గురించి అతనికి అవసరం లేదు,ఇపుడు కొత్తగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నా గుర్తు వజ్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గా గెలిస్తే ఇక్కడ అభివృద్ధి తో పాటు శాంతీయుత వాతావరణం ఏర్పడుతుంది అని,ఆలోచించి నన్ను గేలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య,పత్తి సంజీవ్, పిడుగు కృష్ణ, సురేష్ పటేల్, సునీల్ కుమార్, సురేందర్, ధరణి సంజీవ్, కిషోర్, శ్యామ్ రాజ్,కృప సాగర్, వరుణ్, మేడి రాజు, శివ ప్రసాద్, నిఖిల్, కమల్ గౌడ్, అరవింద్ యాదవ్, పొన్నాల లక్ష్మణ్, రాకేష్, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు .

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM