V1News Telangana

ఈటల రాజేందర్ సభను విజయవంతం చేయండి.

ఈటల రాజేందర్ సభను విజయవంతం చేయండి...

సామాన్య మహిళకు బిజెపి అవకాశం కల్పించింది..

విలేకరుల సమావేశంలో రామగుండం నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కందుల

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 18:-

గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే.. బిజెపి స్టార్ క్యాంపనర్ ఈటెల రాజేందర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రామగుండం నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్కండేయ కాలనీలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ.. సామాన్య మహిళకు బిజెపి అధిష్టానం అవకాశం కల్పించిందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలందరూ గమనించాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నుండి రోడ్డు మార్గాన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గోదావరిఖనికి చేరుకుంటారని మొదటగా గోదావరి నది బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికి అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీగా సభస్థలికి చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుల సంఘాల బాంధవులు ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంధ్యారాణి పిలుపునిచ్చారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?