సింగరేణి మనుగడ సిఎం కెసిఆర్ తోనే సాధ్యం
సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు అమలు చేసింది కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి దివించండి
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 17:-
రామగుండం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ సింగరేణి మనుగడ సిఎం కెసిఆర్ గారితోనే సాధ్యమని సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు అమలు చేసింది సిఎం కేసీఆర్ నీ రామగుండం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. ఆర్జీ 2 తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్దాయు సమావేశం లోటి.బి.జి.కె.ఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు బీ.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ నారదాసు లక్ష్మన్ రావు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. .సింగరేణి కార్మికుల సమస్యలను, డిమాండ్లను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారం చేస్తూ.. సింగరేణి పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రామగుండం శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సింగరేణి కార్మికులకు సంక్షేమం చేకూరుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను దేశ ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు ఏనాడు కూడా కార్మికుల పక్షాన ఆలోచన చేయలేదన్నారు. సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను పోగోట్టింది జాతీయ కార్మిక సంఘాలని వాటిని తిరిగి పునరుద్ధరించి కారుణ్య నియమాకాల ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్దన్నారు. కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చి రామగుండంలో గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్కవిత కర్మికుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం గొప్ప ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి ని పైవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తే సిఎం కేసీఆర్ నాయకత్వం అందోళన చేసామన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంక్షేమ కోసం నిలబడతారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని.. సంక్షేమ పాలన అందిస్తున్న కెసిఆర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొనే పరిస్థితి ఉండేదని అందరికీ తెలుసన్నారు. జీతం తీసుకుని ఇంటికి వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ గుండాలు దోచుకునేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అవకాశం కావాలంటూ దొంగ మొక్కులతో మన దగ్గరకు వస్తున్నారని.. మీరందరూ కూడా తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. సింగరేణి క్వార్టర్లలో కార్మికులు త్రాగునీటితో ఇబ్బందులు పడుతుండటంతో..ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి, స్వచ్ఛమైన నీరు వచ్చే విధంగా చేశానని అన్నారు. అదేవిధంగా రామగుండం ప్రజానీకం కోసం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక యువత ఉపాధి కోసం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చే రూ.30 కోట్లతో ఐటి పార్క్ కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏనాడు కూడా కార్మికుల కష్టాలను పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా గతంలో కురిసిన భారీ వర్షాలతో వరదల్లో కార్మికులు చిక్కుకుపోగా, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారిని రక్షించానన్నారు. ప్రతి సందర్భంలోనూ కార్మికుల పక్షాన నిలబడి.. వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. కార్మిక లోకానికి ఎల్లప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల ప్రచారాలను నమ్మవద్దని.. వాటిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ని సీఎంగా చేయాలన్నారు. ఆర్జీ 2 టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు అయులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లో టి.బి.జి.కే ఎస్ ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య బీ.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మూల విజయ రెడ్డి కార్పోరేటర్లు సాగంటి శంకర్ బాదె అంజలి మందల కిషన్ రెడ్డి దేవ వేంకటేష్ ఇనుముల సత్యం దేవ వెంకటేష్ ప్రభాకర్ రెడ్డి తాళ్ల రాజయ్య మాదాసు రామమూర్తి దశరధం కరక శ్రీనివాస్ శ్రీనివాస్ మేడి సదయ్య జే.వి.రాజు సంధ్యారెడ్డి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM