కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దంపేట గ్రామస్తులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 06:-
పెద్దంపేట్ -: అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దంపేట గ్రామానికి చెందిన సుమారు 50 మందికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు..పార్టీలో చేరిన వారిలో మాదాసు రాజయ్య ,కొండ వెంకటస్వామి గౌడ్, వేగోళపు వెంకటస్వామి గౌడ్, పొనగంటి రాజయ్య, పుర్ర గట్టయ్య , పల్లె రవి ,గోలి శ్రీశైలం, గోలి వైకుంఠం, గోలి రాము, తమ్మనవెని పోచం, బాలగోని రాజయ్య, బాలగోని మల్లేష్, బాలగోని శంకర్, బైరి సత్తయ్య ,తోడేటి చంద్రయ్య, మెరుగు కుమార్ గౌడ్, మంద రాజ్ కుమార్, పల్లె చంద్రయ్య, సందనవేని లచ్చయ్య తో పాటు తదితరులు చేరారు .. ఈ సందర్భంగా రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో నియంత పాలనకు చమరిగీతం పాడాలంటే కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో నాయకులు బంధారపు బుగ్గ రాములు గౌడ్ ,రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాసి శ్రీనివాస్,20వ, డివిజన అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ నాయకులు సిరిసెట్టి సతీష్ గౌడ్, రామగుండం ,పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి వెంకట్, బీసీ సెల్ 1వ డివిజన్ అధ్యక్షులు నామాల కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








