బాన్సువాడ లో ప్రచారాలు శూన్యం
పరేషాన్ అవుతున్న కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 నాడు జరగనున్నాయి ఎన్నికల తేదీని దృష్టిలో పెట్టుకొని ఆయా నియోజకవర్గాలొ అదికారా పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రచారాలు జోరందుకుంటున్నారు బాన్సువాడ పక్కనే గల బోధన్ నియోజకవర్గంలో సైతం రాజకీయ నాయకులు నువ్వా నేనే అన్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. అయితే బాన్సువాడ నియోజకవర్గం లో మాత్రం అసలు ఎన్నికలు ఉన్నట్టు కనబడడం లేదని నాయకులు సైతం ప్రచారానికి వెళ్లడం లేదని స్థానిక ప్రజలు అటున్నారు మరి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ప్రతిపక్ష పార్టీలా నాయకులు మాకేంటి అనే విధంగా తమ పార్టీల గురించి పట్టించుకోవడం లేదు కొందరైతే ఇరు పార్టీలా మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులు లోపల కుమ్మకయ్యారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు

Author: IRFAN Reporter
Work from as a journalist