రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
గురువారం 39 వ డివిజన్ లో కాంగ్రెస్ బిజెపి పార్టీకి చెందిన 200 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సబ్బండ వర్గాలకు అభివృద్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ఉందని ఈ మానిఫెస్టోలో మహిళా సంక్షేమానికి ప్రత్యేకంగా పెద్దపీట వేశారని అన్నారు సీఎం కేసీఆర్ పాలన వారి మానవీయ కోణంలో ఆ ఆలోచన విధానం చూసి ఇతర పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక రావు కార్పొరేటర్ జెట్టి జ్యోతి రమేష్ నాయకులు దేవెేందర్ అనుముల భధ్రయ్య జిమ్మిడి మల్లేష్ పాల్గొన్నారు బీ ఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మేకల మల్లేష్ రాజు బజిమ్మిడి సంతోష్ మల్లేష్ మధునయ్య సారా వడ్డూరి రాజేశ్వరి సంపత్ శ్రీనివాస్ తిరుమల రాజేందర్ రమణయ్య అంజయ్య రవి జ్యోతి యాదగిరి అశోక్ తదితరులు ఉన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....