V1News Telangana

best news portal development company in india

అధికారుల రాక సమాచారంతో ఎక్కడికక్కడ ఇసుక ట్రాక్టర్లు ఇసుక ఆటోలు బంద్ మొరం టిప్పర్లు మొరం టాక్టర్లు సైతం

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలుర మండల కేంద్రంలో మైనింగ్ అధికారులు వస్తున్నట్లు సమాచారం రావడంతో ఇసుక ట్రాక్టర్లు ఇసుక ఆటోలు ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయి అనే టాక్ బయట భారీగానే వినిపిస్తుంది. లీగల్, ఇడ్లిగలుగా నడిచే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం రోడ్డుపై కనిపించకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయింది, ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు అనునిత్యం లీగల, ఇల్లీగల, అభివృద్ధి పనుల పేరుతో పగలు, రాత్రి తేడా లేకుండా అనునిత్యం వాహనాల ఇసుక వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండి దుమ్ముతో ధూళి తో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలు ఇదేమిటని స్పందించారా అని ఎవరికైనా అధికారులకుచెప్పినా సదురు అధికారులు ఇసుక వాహనపుదారులకు సమాచారం ఇస్తారు అని భయం అదేవిధంగా స్పందించరు అని ఒక ఆవేదన, ఎంత చెప్పినా ఇంతే ఇక చెప్పడం మానేసి నోళ్లు మూసుకున్న జనంకు ఇసుక టిప్పర్లు ఇసుక ట్రాక్టర్లు ఇసుక ఆటోల ద్వారా తిప్పలు తప్పడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. అభివృద్ధి పనుల పేరుతో అదే విధంగా లీగల్ పేరుతో ఇసుక ఇతర చోట్లకి తరలిస్తూ భారీగా సంపాదించుకుంటున్నారు ఇసుక మాఫియాదారులు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వీటిపై చర్యలు తీసుకునే అధికారులు మాత్రం మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు అంటున్నారు, వాహనపు డ్రైవర్లు అతివేగంగా వెళ్లడం అధిక లోడుతో వెళ్లడం అదేవిధంగా లైసెన్సులు ఉన్నాయా లేదా అని అనుమానాలు ఫిట్నెస్ ఉన్నాయా లేదా అని అనుమానాలు అగ్రికల్చర్ పర్పస్ లో ఉపయోగించే ఇతర పర్పస్ లో ఉపయోగించే వాటిని ఇసుక తరలింపులో ఉపయోగించడమేమి ప్రశ్నలు ప్రజల లో తలెత్తుతుండగా అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా మామూళ్ల మత్తులో ము లుగుతున్నారని విమర్శలు లేకపోలేదు, ఈ మధ్యకాలంలో సాలం పాడు గ్రామంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన చేసినప్పుడు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భారీగా సీరియస్ అయ్యారు అనే వాదన బలంగా బయట వినిపిస్తుంది, ఎంత చెప్పినప్పటికీ మాత్రం సక్రమ పద్ధతిలో అక్రమంగా ఇసుక తల్లుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓవైపు ఇసుక మరోవైపు అత్యంత లోతులో మొరం త్రవ్వకాలు కూడా భారీగా జరుగుతుందని భూగర్భ జలాలు అడుగంటి విధంగా పెద్ద పెద్ద గుంతల్లో మొరం త్రవ్వకాలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం కన్నులు ఉండి చూడకుండా నిర్లక్ష్యం చేయడం ఏమిటని మామూళ్ల వైపు లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలుగుతున్నారని తప్ప అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు, సాలూర మండలం బోధన్ మండలం ఇసుక పాయింట్ల వద్ద ఇసుక జోరుగా తల్లుతున్నప్పటికీ అక్రమ, సక్రమమా వాటిపై చర్యలు తీసుకునే దిశలో వివిధ శాఖల చెందిన అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై జిల్లా అధికారులు స్పందించాలని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వాల్టా చట్టాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india