V1News Telangana

best news portal development company in india

గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

SHARE:

గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

 

బోధన్ పట్టణంలోని త ట్టి కొట్ ప్రాంతంలో బజరంగ్దళ్. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 70 అడుగుల జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై కాషాయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గో సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని సకల దేవతల స్వరూపం గోవు అని ధర్మం కింద అందరూ సమానులే నాని అన్నారు. పిల్లలు
ధర్మాన్ని కాపాడుతూ తల్లి దండ్రులను గౌరవించాలని సుచించారు. ఆదర్శ పురుషడు పితరువాఖ్య పరిపాలకుడు శ్రీ రాముడు డని వారి తల్లి లాగే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయలను నేర్పాలని అన్నరు. రామ రాజ్యం ముక్తి జ్ఞానం దిశగా ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన సద్భుద్ది కలిగి ఉండాలన్నారు.పిల్లలకు సెలఫోన్ కు దూరంగా ఉంచాలనిఅన్నారు. సనాతన ధర్మం, మహా పురుషుల గురించి వివరించారు.భగవంతుని నామస్మరణకు సమయం కేటాయించాలని
యువత పెడదారి పట్టకుండా చూస్తూ వారిని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలని కోరారు. కాషాయ ధ్వజం చూస్తే ధర్మం గుర్తు రావాలి గీత మానవ ధర్మం గురించి చెపుతోంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మాసిని వినోద్ ( చిన్న) భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షుడు గోపి కిషన్. రుద్ర సత్యనారాయణ. వార్డ్ ప్రజలు కాలనీ వాసులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india