Post Views: 287
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా అక్రమంగా ఇసుక రవాణా టిప్పర్ల ద్వారా జరుగుతుందన్న సమాచారం మేరకు రేంజల్ మండల కేంద్రంలోని పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈరోజు ఉదయం అక్రమంగా ఇసుకను నింపుకెళుతున్న టిప్పర్ వాహనాన్ని రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తమ సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది.అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేస్తామని రెంజల్ ఎస్సై చంద్రమోహన్ మీడియాతో తెలిపారు. ఇకపై ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎవరైన అక్రమంగా ఇసుక రవణలు జరిపితే ప్రజలు అధికారులకు సమాచారం ఇవ్వాలని వారికి సమాచారాన్ని వారి పేర్లు రహస్యంగా ఉంచబడుతయని రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








