Post Views: 88
లంచం కోసం రెవెన్యూ అధికారుల వేధింపులకు భార్యాపిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
తాత పేరిట భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ తన భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసి ఆటో డ్రైవర్
పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా.. కాలి పోయిన ఆటో
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో తనతాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ఆటోడ్రైవర్ శంకర్
ఆర్డీవో కార్యాలయానికి ఆన్లైన్లో దస్త్రం వెళ్లగా.. ఆఫ్లైన్లో తమకు రాలేదని చెప్పిన సిబ్బంది
ఆర్ఐ సాహత్ రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా తనవద్ద అంతలేదని రూ.5 వేలు ఇచ్చానని, కానీ మిగిలినవి ఇస్తేనే దస్త్రం కదులుతుందని చెప్పారని ఆరోపించిన బాధితుడు
దీంతో మనస్తాపానికి గురై.. శంకర్ తన ఆటోపై పెట్రోలు పోసి.. తన భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతో పాటు తనపై పెట్రోలు పోసుకునేందుకు యత్నిస్తుండగా ఆటోకు నిప్పంటుకోగా కాలిన శంకర్ చేతులు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








