Post Views: 157
బోధన్, సెప్టెంబర్ 14:వీరభద్ర స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో పరిశుభ్రతా కార్యక్రమాన్ని హిందూ వాహిని బోధన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వీడియోకు స్పందనగా, విగ్రహాన్ని పరిశుభ్రపరచి, అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నగర కోర్ కమిటీ సభ్యులు కల్దుర్కి శ్రీనివాస్, కందికట్ల భాస్కర్, గుంట శేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు సుంకు శేఖర్, నగర ప్రచార ప్రముఖుడు పాలకుర్తి లక్ష్మణ్, ఐరన్ల రాజు, పుర్మా సతీష్ (ఆర్.ఆర్. డ్రెస్సెస్), దుబ్బాక సాయిలు పాల్గొన్నారు.
అలాగే బిజెపి నాయకులు కందికట్ల వాసు, నందిపేట్ భూమయ్య, జల్లుల సతీష్ హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా సహకరించారు. ఈ సందర్భంగా ప్రణవానంద స్వామీజీ విచ్చేసి ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








