V1News Telangana

best news portal development company in india

ఏక చక్రేశ్వర దర్శనానికి కాలినడకన భక్తుల యాత్ర

SHARE:

సాలూర 18, ఆగష్టు (వి1 న్యూస్) : శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని, ఆధ్యాత్మిక భక్తితో మేళవించి సాలూర మండలానికి చెందిన మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామాల భక్తులు శ్రీ ఏకచక్రేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించేందుకు బోధన్ పట్టణం వైపు సోమవారం కాలినడకన ప్రయాణం ప్రారంభించారు. భక్తులు భజనలు, శివనామ స్మరణ చేస్తూ శ్రద్ధా, ఆస్తికతతో ముందుకు సాగారు. ఈ యాత్రలో మృదంగాలు, తాళాలు, కీర్తనలు ఆలపిస్తూ ఊరూరా ఆధ్యాత్మిక చైతన్యం నెలకొంది. పవిత్ర శ్రావణ మాసంలో ఇలాంటి కాలినడక యాత్రలు గ్రామీణ ప్రాంతాలలో సాధారణమే అయినా, ప్రతి యేటా సమూహంగా ఇలా బయలుదేరటం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది.
మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్
Author: మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్

వి1 న్యూస్ పత్రిక, ఛానల్ లో పని చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండలాల పాత్రికేయలు కావలెను. సంప్రదించాల్సిన నంబర్లు : 9603925163 - 9834485832

best news portal development company in india