V1News Telangana

best news portal development company in india

శ్రావణమాసం చివరి రోజు సోమవారం హున్స,మందర్న, ఖాజాపూర్ ప్రజలు పాదయాత్ర

SHARE:

శ్రావణ సోమవారానికి ముగింపు.. హున్స, మందర్న, ఖాజాపూర్ ప్రజల పాదయాత్ర..

. ఏకచక్వేశ్వర ఆలయానికి భక్తుల శోభాయాత్ర…

 బుద్దే రాజేశ్వర్ విగ్రహం వద్ద పండ్ల పంపిణీ…శ్రావణ సోమవారానికి ముగింపు.. హున్స, మందర్న, ఖాజాపూర్ ప్రజల పాదయాత్ర..
. ఏకచక్వేశ్వర ఆలయానికి భక్తుల శోభాయాత్ర…
బుద్దే రాజేశ్వర్ విగ్రహం వద్ద పండ్ల పంపిణీ…

బోధన్ రూరల్, ఆగస్టు 18 (V1):
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల నుండి భక్తులు శోభాయాత్రగా పాదయాత్ర చేస్తూ బోధన్ శ్రీ ఏకచక్వేశ్వర శివాలయానికి చేరుకున్నారు. భక్తుల రాకతో పట్టణం భక్తి వాతావరణంలో మునిగిపోయింది.
 
ఈ సందర్భంగా బుద్దే రాజేశ్వర్ విగ్రహం వద్ద సాలూర బిజెపి మండల అధ్యక్షులు రావుబా గంగాధర్ పండ్ల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఏటా ఆనవాయితీగా పాదయాత్ర కొనసాగుతున్నదని, భక్తులు విశ్వాసం, శ్రద్ధతో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు…
ఉప్పు నరేందర్
Author: ఉప్పు నరేందర్

📢 ఉప్పు నరేందర్ 📰 బోధన్ రూలర్ రిపోర్టర్ 📞 సంప్రదించవలసిన నంబర్ : 9515361229

best news portal development company in india