V1News Telangana

best news portal development company in india

పాండు తర్ప దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్ విట్టల్ చొరవ బోధన్ గ్రామ చావిడిలో భూభారతి రివ్యూలో దరఖాస్తుల పరిశీలన . భూభారతి సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు చర్యలు..

SHARE:

 పాండు తర్ప ప్రజల సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ విట్టల్ పరిశీలన

 బోధన్‌లో రెవెన్యూ సదస్సులో దరఖాస్తులపై సమీక్ష

పాండు తర్ప దరఖాస్తుల పరిశీలనలో తహసీల్దార్ విట్టల్
బోధన్ పట్టణంలోని గ్రామ చావిడి వద్ద శుక్రవారం నాడు తహసీల్దార్ విట్ఠల్ భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన పాండు తర్ప దరఖాస్తులను పరిశీలించారు. పాండు తర్ప క్రింద దరఖాస్తు చేసిన పలువురు గ్రామస్థులు గ్రామ చావిడికి హాజరయ్యారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, “భూభారతి, రెవెన్యూ సదస్సులు ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మారుతున్నాయి. ప్రతి దరఖాస్తును నిఖార్సైనంగా పరిశీలించి, వేగంగా పరిష్కారం చూపుతున్నాం,” అని అన్నారు.
అధికారులతో కలిసి పాండు తర్పకు సంబంధించిన భూ వివరాలను పరిశీలించి, అర్హులకు తగిన సర్టిఫికెట్లు, మార్పులు చేర్పులు నమోదు చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india