V1News Telangana

best news portal development company in india

మహిళల భద్రత మా ప్రాధాన్యం” – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య..

SHARE:

భరోసా కేంద్రం అండగా – బాధితులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం..

. నిజామాబాద్‌లో భరోసా కేంద్రం సేవలు విస్తరణ – మహిళలు, పిల్లలకు పోలీసుల భరోసా….

. పోక్సో, అత్యాచార కేసుల బాధితులకు భరోసా కేంద్రం చెక్కుల పంపిణీ..

“మహిళల భద్రత మా ప్రాధాన్యం” – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య..

. భరోసా కేంద్రం సాయంతో బాధితులకు కొత్త ఆశ – నిజామాబాద్‌లో సేవల విస్తరణ.

V1 న్యూస్.నిజామాబాద్, జూలై 25:

మహిళలు మరియు పిల్లల పట్ల జరుగుతున్న దౌర్జన్య ఘటనల్లో బాధితులకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోంది. ఈ కేంద్రం ద్వారా అత్యవసర అవసరాల్లో ఉన్న బాధితులకు ఆర్థిక, మానసిక, చట్టపరమైన సహాయం అందిస్తూ కొత్త ఆశను నూరిపోస్తోంది.

 

ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పోక్సో మరియు రేప్ కేసులలో బాధితులుగా ఉన్న ఏడు మంది మహిళలు మరియు పిల్లలకు భరోసా కేంద్రం తరపున ఆర్థిక సాయం అందించారు. ఈ చెక్కులను పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. గారు స్వయంగా అందజేశారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, “భరోసా కేంద్రం అనేది కేవలం ఒక సేవా కేంద్రం కాదు, న్యాయం కోసం నిలిచే వేదిక. మహిళలు, పిల్లలు భయపడకుండా తమ సమస్యలు చెప్పుకునేలా చేస్తూ, వారికి ధైర్యాన్ని, భద్రతను కలిగించే విధంగా పని చేస్తుంది,” అని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి. రోజా, లీగల్ అడ్వైజర్ డయాణ గీతిక, మహిళా పోలీస్ ఎస్‌ఐలు పుష్పావతి, మౌనిక, తదితర అధికారులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india