ఇసుక మాఫియా రౌడీయిజం – హైవేలపై బీభత్సం, అధికారుల మౌనసమ్మతి?
సాలుర – నిజామాబాద్ జిల్లా | వి1 న్యూస్ ప్రత్యేక కథనం..
హైవే మీద అతివేగంగా పరిగెత్తుతున్న ఆటో ట్రాలీలు, నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లు, మైనర్లతో నడుపబడుతున్న వాహనాలు – ఇదే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని సాలుర మండలంలో కనిపిస్తున్న మాఫియా దుర్వినియోగ చిత్రణ. ఎలాంటి వెయ్బిల్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాల మోత పెడుతూ ప్రజల ప్రాణాల్ని సవాల్ చేస్తోంది ఇసుక మాఫియా.

ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అవసరమైన బ్యాచ్ నంబర్లు, నిబంధనలు మామూలు ప్రజలకు మాత్రమేనా? మాఫియా మాత్రం స్వేచ్ఛగా – “ఇది మా దారి, ఏం చేస్తారో చేసి చూపండి” అన్న తరహాలో రెచ్చిపోతున్నారు…

.అక్రమ ఇసుక రవాణా సమాచారం ఇచ్చిన వారు బెదిరింపులకు గురవుతున్నారు. సాక్ష్యాలున్నా, సీసీ కెమెరాల్లో దృశ్యాలున్నా, అధికార యంత్రాంగం మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఎవరి అండతో మాఫియా రెచ్చిపోతుందన్న వదంతులు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి…
బాబా గార్డెన్, దాబాలు, సాలుర క్యాంప్ చౌరస్తా… ఇవన్నీ మాఫియా లాంఛనంగా మారాయి. అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలను నిలిపే ప్రయత్నం చేస్తే దాడులకు దిగడానికి సైతం వెనకాడటం లేదు.
ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు –
“మా వాహనాలకు నోటీసులు, జరిమానాలు… మాఫియాకి మాత్రం విముక్తి ఎందుకు?”పో
లీసులూ రెవెన్యూ అధికారులూ మాఫియాకు ఎదురయ్యే ధైర్యం చూపించే సమయం ఇదే. లేకపోతే ప్రజల ప్రాణాలు మాఫియా రాళ్ల కింద నలిగిపోతాయన్న భయం ప్రజల్లో నెలకొంది.పత్రికా వ్యవస్థ, బహిరంగంగా గళమెత్తుతున్న జనాన్ని భయపెట్టే స్థాయికి చేరిన మాఫియా దౌర్జన్యం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ, రవాణా శాఖ, మైనింగ్ శాఖ కలసి చట్టబద్ధంగా చురుగ్గా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆ బాధ్యత అధికారులదే అవుతుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








