V1 న్యూస్.హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం తిరగబడుతోంది. తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం (జూలై 18) మరియు శనివారం (జూలై 19) రోజులలో వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడినట్టు పేర్కొంది.
శుక్రవారం రోజున వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, నల్గొండ, నాగర్కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శనివారం నాటికి వర్షపాతం మరింత విస్తరించి హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ వంటి జిల్లాలను ప్రభావితం చేయనున్నట్టు అంచనా వేసింది.
ఈదురు గాలుల వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని హెచ్చరించింది. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎటువంటి అత్యవసర పనులు లేకుంటే బయటకు రావద్దని, డ్రైనేజీలు, తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








