వి1 న్యూస్.హైదరాబాద్:హైడ్రా నిర్వహణపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వ్యవస్థ అమలులోకి వచ్చిన అనంతరం ఏడాది కాలంలో ఆ సంస్థ అనేక మంచి, చెడు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వానికి చెందిన విలువైన స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడడంలో హైడ్రా గణనీయమైన విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు. “ఇప్పటివరకు సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూములను పరిరక్షించగలిగాము. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.30 వేల కోట్లను మించుతుంది,” అని ఆయన వివరించారు.
అలాగే, నగరంలోని ఆరు ప్రధాన చెరువులను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని, వాటి విస్తీర్ణం గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పెరిగిందని తెలిపారు.
“ఇది ఏకకాలంలో పర్యావరణ పరిరక్షణకు, శుద్ధమైన నీటి నిల్వకు, భూగర్భజలాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ అభివృద్ధి అంతా పక్కా ప్రణాళికతోనే సాధ్యమైంది” అని రంగనాథ్ గారు స్పష్టం చేశారు.
పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్న హైడ్రా: కమిషనర్ రంగనాథ్..
. రెట్టింపు అభివృద్ధితో హైడ్రా పురోగతి: ప్రభుత్వ భూముల పరిరక్షణపై ఫోకస్..
. 30 వేల కోట్ల ప్రభుత్వ స్థలాలు రక్షించిన హైడ్రా టీమ్: రంగనాథ్…
ఆరు చెరువుల పునరుద్ధరణ – హైడ్రా విజయగాథలో మరో అధ్యాయం..
. హైడ్రా పనితీరుపై కమిషనర్ రంగనాథ్ విశ్లేషణ: పక్కా ప్రణాళికే విజయ రహస్యమని స్పష్టం…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








