వి1 న్యూస్.హైదరాబాద్:- తెలంగాణలో రాజకీయ రంగం మళ్లీ వేడెక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి.
ఈసారి మొత్తం 566 జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఎంపీటీసీ స్థానాల్లో తగ్గుదల కనిపించింది, ఇది 71 గ్రామ పంచాయతీల మున్సిపాలిటీల్లో విలీనంతో జరిగింది.
ఇక బీసీలకు భారీగా రిజర్వేషన్లు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్డినెన్స్ గవర్నర్ సమక్షంలో ఉంది – సంతకం అయిన వెంటనే అమలులోకి రానుంది.
🗳️ గత ఎన్నికల పరిపరిశీలన:
2019లో జరిగిన ఎన్నికల్లో TRS భారీ విజయం సాధించింది. మొత్తం 534 జెడ్పీటీసీల్లో 446, 5,800 ఎంపీటీసీల్లో 3,556 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 76 జెడ్పీటీసీలు, 1,377 ఎంపీటీసీలు గెలుచుకుంది. బీజేపీ 8 జెడ్పీటీసీలు, 211 ఎంపీటీసీలతో మూడో స్థానంలో నిలిచింది.
📌 ప్రజాప్రతినిధుల బాధ్యతలు:
ZPTC & MPTC సభ్యులు ప్రజల నేరుగా ఓటుతో ఎన్నికవుతారు. మైనారిటీలకు కో-ఆప్ట్ సభ్యులుగా అవకాశం ఉంటుంది. అభివృద్ధి, పథకాలు, పర్యవేక్షణలో వీరి పాత్ర కీలకం.
🏁 రాజకీయ పార్టీలు సిద్ధంగా.. ఎన్నికల కమిషన్ సన్నద్ధం!
ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టింది. జూలై 23న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అన్ని పార్టీలు రంగంలోకి దిగేందుకు వేచి చూస్తున్నాయి…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








