V1News Telangana

జగదాంబ సేవలాల్ ఆలయ 8వ వార్షికోత్సవం వైభవంగా చండీ హోమం, భక్తుల ఉత్సాహం మధ్య విజయవంతం…

చండీ హోమం, భక్తుల ఉత్సాహం మధ్య విజయవంతం

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో జగదాంబ సేవలాల్ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు, తండావాసులు ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించగా, కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆలయ మాజీ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు అందరూ విశేష సహకారం అందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ –
“ఈ పుణ్య కార్యాన్ని మీ అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలిగాము. ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవదర్శనం చేసుకున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post