Post Views: 17
ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఓ కీలక పరిణామానికి వేదిక కానుంది. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లు కలసి జిల్లాలో పర్యటించనున్నారు.
ఇప్పటివరకు నిదానంగా సాగిన అభివృద్ధి పనుల పట్ల ప్రభుత్వం తలెత్తిన అసంతృప్తికి పరిష్కారం చూపేందుకే ఈ పర్యటనల స్కెచ్ అని భావిస్తున్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో వివిధ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు పై లోతైన చర్చలు జరగనున్నాయి. జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మంత్రులు అధికారులకు కీలక సూచనలు ఇవ్వనున్నారు. పనుల్లో నిర్లక్ష్యం ఉంటే ఆఫీసర్లకు మినహాయింపు ఉండబోదన్న సంకేతాలు ఇప్పటికే బయటపడుతున్నాయి.
ప్రజల్లోకి ప్రభుత్వం పునర్విశ్వాసం కలిగించేందుకు ఇది ఓ మాస్టర్స్ట్రోక్ కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. పర్యటన అనంతరం జిల్లాలో కొన్ని కీలక శాఖల్లో మార్పులు జరగవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....