Post Views: 47
తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ రూపంలో గుడ్ న్యూస్ అందించింది. మే నెలలో 4021 మందికి నెలకు రూ.2016 చొప్పున పెన్షన్ మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయంలో కేవలం 4011 మందికే ఈ సహాయం అందుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధిక సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేసింది.
ఈ ప్రగతికి ముఖ్య కారణంగా మంత్రి సీతక్క చొరవను ప్రభుత్వం పేర్కొంది. నూతన లబ్ధిదారుల ఎంపిక వేగవంతంగా జరిగిందని వెల్లడించింది. ఇది తెలంగాణలో డయాలసిస్ రోగుల కోసం పెన్షన్ అందించిన తొలి ఘట్టం కావడం విశేషం.
ఇంతటితో ఆగకుండా, ఇప్పుడు హెచ్ఐవీ బాధితుల కోసం కూడా పెన్షన్ అమలుపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 13 వేల మందికి పైగా హెచ్ఐవీ బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఈ అంశంపై ఆర్థిక శాఖ అనుమతిని కోరుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు సుమారు రూ.993 కోట్లు వెచ్చిస్తోంది. ఇక కొత్త పెన్షన్లతో పాటు ఇతర విభాగాలకు కూడా ఇదే విధంగా సహాయం అందించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....