V1News Telangana

బోధన్‌లో మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో రుచుల రసవిందన — ఫుడ్ ఫెస్టివల్‌కు సబ్ కలెక్టర్…

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మున్సిపాలిటీ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మునిసిపల్ కార్యాలయ ఆవరణలో భోజన ప్రదర్శన – ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 20 మంది మహిళా సంఘాల సభ్యులు 20 స్టాల్స్ ఏర్పాటు చేసి వివిధ రుచికరమైన మరియు సంప్రదాయ ఆహార పదార్థాలను ప్రదర్శించారు. వీటిలో స్వీట్లు, స్నాక్స్, పచ్చళ్లు, మసాలా పొడులు, రాగి ఉండలు, నేతి బొబ్బట్లు, సర్వపిండి, బిర్యానీలు, గులాబ్ జామున్, పూర్ణం బూరెలు, మురుకులు, అరిసెలు వంటి ఇంటింటి వంటకాలు ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గారు ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ తరహా ప్రదర్శనలు ఉపయుక్తమవుతాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలు అన్ని విధాలుగా సహకారం అందించనున్నాయని, అలాగే శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, తహశీల్దార్ విట్టల్, మున్సిపల్ మేనేజర్ రమేష్, మెప్మా టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

24న పీసీసీ పీఏసీ మీటింగ్: సీఎం రేవంత్, భట్టి, మంత్రులు హాజరు.. . పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీకి సిద్ధం: కీలక నిర్ణయాలు వీలయ్యే అవకాశం… గాంధీభవన్‌లో 24న పీఏసీ సమావేశం – లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించనున్న నేతలు… . పార్టీ వ్యూహాలపై సమాలోచనకు కాంగ్రెస్ శిబిరం సిద్ధం… పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు – కొత్త బాధ్యతల భరించనున్న నేతలు…

డయాలసిస్ పేషెంట్లకు ఊరట! తెలంగాణలో పెన్షన్లు మంజూరు.. మరి మంచి చేసిందీ ప్రభుత్వం: డయాలసిస్ రోగులకు రూ.2016 పెన్షన్.. . మొదట డయాలసిస్.. తర్వాత హెచ్ఐవీ! పెన్షన్ శ్రేణిలో కీలక నిర్ణయం బీఆర్ఎస్ కంటే మెరుగైన సహాయం: మే నెలలోనే 4021 మందికి పింఛన్.. . సీతక్క చొరవతో కొత్త లబ్ధిదారులకు ఆసరా!…

ఇకపై ఒకటే నంబర్: అత్యవసర సేవలకే 112! పోలీసులు, అంబులెన్స్, ఫైర్‌ సేవలు – ఒకే నెంబర్ 112 తెలంగాణలో అమలులోకి 112 ఎమర్జెన్సీ నెంబర్: డీజీపీ జితేందర్ . ప్యానిక్ బటన్ తో సహాయం… 112తో దేశవ్యాప్తంగా ఒకే స్పందన . ఎమర్జెన్సీలో ఒక్కటే కాల్ చాలు: 112 టోల్‌ఫ్రీ సేవ ప్రారంభం…