Post Views: 84
బోధన్, జూన్ 20:రాష్ట్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా, రాకాసిపేట్ బ్రాంచ్ యూనియన్ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, అనాథ విద్యార్థులకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు.
యూనియన్ సెక్రటరీ నాగరాజు, అసిస్టెంట్ సెక్రటరీ రాధికతో పాటు సభ్యులు నన్నపునేని లాలయ్య, సుధాకర్, తౌర్యా, ఆనంద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవ్యశ్రీ, మాహిన్ బేగం, మధుప్రియ, నాగలక్ష్మి, ఆదిత్య అనే విద్యార్థులకు ఒక జత చొప్పున దుస్తులు అందించారు.
ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బాలచంద్రం, ఉపాధ్యాయులు శ్రీ కృష్ణ, నగేష్ బాబు, సంజీవ్ కుమార్, సుధాకర్ రెడ్డి, ఖైరాన్, రాకేష్, జ్యోతి, వనిత పాల్గొన్నారు.
విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చిరకాలం నిలిచేలా చేసిన ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....