Post Views: 103
బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఈరోజు సాలూర తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సాధస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిశీలనను ఆయన స్వయంగా చేపట్టారు.
అప్లికేషన్లను విభాగాల వారీగా జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం, సబ్ కలెక్టర్ స్టాఫ్కు కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రతి అప్లికేషన్ను మాడ్యూల్ వారీగా వర్గీకరించి, తగిన నోటీసులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సాధస్సులు ఎంత ముఖ్యమో గుర్తు చేసిన సబ్ కలెక్టర్, అన్ని దరఖాస్తులపై త్వరితగతిన స్పందించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....