– ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి మరియు బొమ్మన్ దేవ్ పల్లి గ్రామాలలో మాదిగ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంథని సామ్యేల్ మాట్లాడుతూ “మాదిగ ల ఉద్యమం మానవతా ఉద్యమం” గా మారిందని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకు ముప్పై ఏళ్ల క్రితం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆవిర్భవించిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం అనేక త్యాగాలతో,వరుస విజయాలతో , అంతిమంగా వర్గీకరణ విజయం తో అన్ని వర్గాల ప్రజల కొరకు మానవత్వ ఉద్యమం గా మారిందని.. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం జూలై 7 న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజల సమక్షంలో పండగలా ఘనంగా జరిపే విధంగా ఎమ్మార్పీఎస్, మరియు అనుబంధ విభాగాలు ఇప్పటి నుండే కృషి చేయాలనిపిలుపునిచ్చారు. అదేవిధంగా నూతన కమిటీలను పునః నిర్మించుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కొత్తోల్ల యాదగిరి, కొక్కొండ, దాకయ్య , శైలేష్ మాదిగ, మండల కన్వీనర్ టేకుర్ల సాయిలు, నాయకులు విజయ్, మహిళా నాయకులు బానాపురం లావణ్య ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..