సాలూరు (నిజామాబాద్ జిల్లా):
రైతులకు సాగునీరు ఇవ్వాల్సిన పంటకాలువలు ఇప్పుడు బడా బాబుల షాపింగ్ వీధులుగా మారిపోయాయి. వాణిజ్య భవనాలు, గోడౌన్లు.. రెంటుకి ఇవ్వడమూ మామూలే! ప్రభుత్వ అధికారుల నిర్వీర్యతకు ఇది నిదర్శనం.
పరిరక్షణలో ఉండాల్సిన కాలువలు, పాలాధులు ఇప్పుడు లాభాల వీధులయ్యాయి.
👉 అధికారుల మౌనం – మాఫియాకు ఆమోదం?
పబ్లిక్ పేపర్లో నోటీసులు.. గ్రౌండ్లో భూ ఆక్రమణే!
శాసన రక్షకులూ.. ఆక్రమణ మాఫియాకు తోడూ?
👉 న్యాయం కోసం ఎదురు చూస్తున్న సాలూరా రైతులు
👉 బడా బాబుల అడ్డగోలుతనంపై నిఘా అవసరం
అధికారులపై ప్రాధాన్యతగా విచారణ జరగాలి
సర్వేలు ఎప్పుడు? చర్యలు ఎప్పటికి?
అధికారుల నాటకపు నోటీసులు – ప్రజల్లో కోపం!
నోటీసులు ఇచ్చినట్టు చెబుతారు. కానీ, అదే సమయంలో గోడలు కట్టి షాపులు కట్టినవారిని కళ్లారా చూస్తారు. ఇది నిబంధనలపై నిండుగా వేసిన వలే!
ఊరిని కాపాడాల్సినవారే వేటగాళ్లైతే?
ప్రభుత్వ శాఖలే బలహీనమైతే, ప్రజల న్యాయం ఎవరివద్ద?
ఎమ్మెల్యే గారు – మీ పార్టీ కార్యకర్తల పనులు కూడా చూసుకోండి.
మీ పేరుతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టండి – లేదంటే నమ్మకానికి తూటా పడే ప్రమాదం ఉంది.
🔴 ప్రజలు ప్రశ్నిస్తున్నారు:
అధికారుల చేతులెత్తివేతకు బాధ్యత ఎవరిది?
రైతుల న్యాయం ఎక్కడ దాక్కుంది?
బడా బాబుల రాజ్యం ఇంతలా పెరిగినపుడు ప్రజాస్వామ్యమేం మిగిలింది?
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








