హైదరాబాద్, జూన్ 10 :-తెలంగాణ రాజకీయాల్లో రేపు (బుధవారం, జూన్ 11) తుది పరీక్ష రోజు. బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ శిఖరాలను తాకుతోంది.
💥 విచారణ కాదు – రాజకీయ అస్తిత్వ పరీక్ష!
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఎదుట రేపు ఉదయం 11గంటలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఇది సాధారణ విచారణ కాదని, బీఆర్ఎస్ భవితవ్యాన్ని నిర్ణయించే దశగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విచారణలో ప్రశ్నల వర్షం, ఘోష్ ధాటిగా, కేసీఆర్ ప్రత్యుత్తరాల్లో ఎత్తుపల్లాలు, ఇవన్నీ రేపటి పొలిటికల్ డ్రామాకు ప్రధాన హైలైట్స్. ఇప్పటికే హరీష్ రావు, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరై కీలక ఆధారాలు సమర్పించిన సంగతి తెలిసిందే.
🚨 500 వాహనాల కాన్వాయ్, బీఆర్ఎస్ బల ప్రదర్శన
విచారణకు న్యాయపరంగా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ చెబుతున్నా, రాజకీయంగా బలాన్ని ప్రదర్శించడమే అసలైన లక్ష్యంగా కనిపిస్తోంది. ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్ నుంచి కేసీఆర్ భారీ కాన్వాయ్తో బయలుదేరనున్నారు. దాదాపుగా 500 వాహనాల బృందం, అనేక నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు కేసీఆర్కు మద్దతుగా నగరంలో తళుక్కున మెరుస్తున్నారు.
🛑 జీహెచ్ఎంసీ నుంచి బీఆర్కే భవన్ వరకు పోలీసుల ఫుల్ బ్లాక్
బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. GHMC నుంచి సచివాలయం వరకు ట్రాఫిక్ పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. విచారణ ప్రదేశం చుట్టూ మినీ లాక్డౌన్ వాతావరణం.
🎤 కేసీఆర్ ప్రెస్ మీట్ – కీలక ప్రకటనల సంకేతం?
విచారణ అనంతరం తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. విచారణలో ఏమి జరిగిందో, కేసీఆర్ ఎలా స్పందించారో అదే సమయంలో వెల్లడయ్యే అవకాశముంది. హరీష్ రావుతో ఇప్పటికే రెండు విడతలుగా మంతనాలు జరిపిన కేసీఆర్ రేపు సంచలన వ్యాఖ్యలు చేయవచ్చని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








