పేకాట రాయుడి అరాచకాలు – మాఫియాకు అధికారుల కట్టు?..
. జీవితాల్ని తాకట్టు పెట్టిస్తున్న పేకాట వడ్డీ గుట్టలు!..
మందు, తిండి, డబ్బు – పేకాట రాజ్యంలో బానిసలుగా మారుతున్న జనాలు!…
. పేకాట రాయుడి చేతిలో లింగంపల్లి యువత “బానిసలు” – పోలీస్ శాఖ ఏమి చేస్తోంది?
శనివారం07: జూన్:2025
కామారెడ్డి జిల్లా నసర్లబాద్ మండలం లింగంపల్లి తండా శివారులోని స్మశాన వాటిక పక్కన, వాస్తవానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన భూభాగంలో గుట్టల మధ్య, చట్టానికి చీకటి చూపిస్తూ పేకాట అరాచకాలు బహిరంగంగా సాగుతున్నాయి.పేకాట రాయుడు ఆధ్వర్యంలో ఈ పేకాట గుట్టలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. “మా వెంటే అధికారులు ఉన్నారు, ఎవరు ఏమి చేయలేరు” అంటూ అతడు ఘర్జిస్తున్నాడట.
పోలీసులపై ప్రభావం చూపిస్తూ, తన గుట్టకు వచ్చిన వారిని మాయ మాటలతో బానిసలుగా మార్చుకుంటున్నాడు. మత్తు పదార్థాలు, తిండి, మందు అందించి పేకాటలో మరింత లోతుగా పడేస్తున్నాడు. ఒక్కసారి చిక్కినవారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.అధిక వడ్డీకి డబ్బులు ఇవ్వడం, విలువైన వస్తువులు తాకట్టు పెట్టించడం వంటి అక్రమ ఆర్థిక లావాదేవీలు అక్కడే నడుస్తున్నాయి.
వాస్తవానికి ఇది జూదం మాత్రమే కాదు, సామాజిక నాశనం.
పలువురు బాధితులు, గ్రామస్తులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు – ఈ విషంపై శ్రద్ధ పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని. లేకపోతే, ఈ అరాచక వ్యవస్థ వల్ల మరెందరో యువకులు రోడ్డుపాలవుతారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....