V1News Telangana

తహసిల్దార్ ను సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

– స్వాగతం పలికి ఘనంగా సత్కారం

– ప్రజా సమస్యలపై పారదర్శకంగా వ్యవహరించాలని సూచనలు

– మండల అభివృద్ధి కొరకు తమ వంతు సహకారం అందిస్తామని స్పష్ఠీకరణ

– బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల తహసిల్దార్ గా సువర్ణ ఇటీవల బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రోజు నసురుల్లాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తహసిల్దార్ కార్యాలయంలో ఆమెను కలిసి స్వాగతం పలుకుతూ పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. తహసిల్దార్ గా ప్రజా సమస్యలపై పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. మండల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని నాయకులు ఆమెతో తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింలు గౌడ్, అఫ్రోజ్, టేకుర్ల సాయిలు, రీహన్, హాజీపూర్ రాము, అల్లం గంగారాం,లక్ష్మణ్ , అల్లం రాములు, గంపల శంకర్, బద్రి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?