సాలూరు, జూన్ 2:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సాలూరు మండల కేంద్రంలో అధికారపూర్వకంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. మండల తహసిల్దార్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, గ్రామ పంచాయతీ ఆవరణ, రైతు వేదిక మరియు సాలూరు సొసైటీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి, మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. పతాక ఆవిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమం, తెలంగాణ రాష్ట్ర ఆత్మను ప్రతిబింబించే విధంగా సాగింది.ఈ వేడుకల్లో సాలూరు మండల తహసిల్దార్ వై. శశిభూషణ్, మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, ఏ.ఈ కావ్య, ఏఈఓ గంగాసాగరి, హున్సా సొసైటీ ఏఈఓ శ్రావణి, సాలూరు సొసైటీ సీఈఓ బసంత్రావు, చైర్మన్ అల్లే జనార్దన్ తదితర అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములమవ్వాలన్న సంకల్పంతో, ఈ వేడుకలు ప్రజల్లో స్ఫూర్తిని నూరిపోసాయి
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








