Post Views: 54
నిజాం పాలనకి గుండెగుబులు తెచ్చిన పోరాట యోధుడు కొమరం భీమ్ జ్ఞాపకార్థంగా విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ముధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వర మండల కేంద్రంలో ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దానసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు.”
ఈ సందర్భంగా మాట్లాడిన పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ –
“కొమరం భీమ్ అంటే ఉద్యమం, తిరుగుబాటు, ఆదివాసీ ఆత్మగౌరవ గర్జన. నిజాం సర్కార్ రాక్షస పాలనను అతలాకుతలం చేసిన ధైర్యశాలి. ‘జల్-జంగల్-జమీన్ మాదే’ అంటూ విప్లవ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం ఆయుధం ఎత్తిన యోధుడు.”
భూమి, అడవి, నీరు కోసం సాగిన ఈ పోరాటం కేవలం ప్రత్యక్ష యుద్ధమే కాదు – అది ఆదివాసీ గొంతుక. అన్యాయానికి ఎదురు నిలబడే స్పూర్తి. కొమరం భీమ్ విగ్రహం కేవలం శిల్పం కాదు – అది శక్తిని, స్వాభిమానాన్ని, శౌర్యాన్ని తెలిపే చిహ్నమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....