బోధన్, సోమవారం: బోధన్ పట్టణంలోని గ్రంథాలయంలో సోమవారం నూతన కంప్యూటర్లను బోధన్ ఎమ్మెల్యే పొదుటూరి సుదర్శన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “విద్యార్థుల उज్వల భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శ్రమిస్తోంది” అని అన్నారు.
మొన్న జరిగిన పదవ తరగతి పరీక్షల్లో బోధన్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఈ వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








