బోధన్, మే 8: బోధన్ బస్టాండ్ రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోంది. బస్టాండ్లో ఆటోలు ఇష్టానుసారంగా పార్క్ చేయడం వల్ల బస్సులు లోపలికి రావడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.ప్రయాణికులు బస్సులోకి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆటోలు అడ్డంగా నిలబడడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బస్టాండ్ లోపలే ఆటోలు నిలపడం వల్ల బస్సులకు నిలిచే స్థలం లేకుండా పోతోంది. ఈ అవ్యవస్థకు కారణమైన ఆటో డ్రైవర్లను నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే కనిపించడంలేదు.”ఆటోలకు బస్లే అడ్డం అవుతున్నాయి… మరి ఇది బస్టాండ్ గదా!” అని ఒక ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో బస్సులు బస్టాండ్లో నిలవకుండా బయటే ఆగిపోతుండడంతో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రయాణికులు బోధన్ డిపో అధికారులు దీనిపై స్పందించాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. “ఇలా ఇంకొన్ని రోజులు కొనసాగితే బస్టాండ్ వదిలేసి బయటే బస్సులు ఆగే పరిస్థితి వస్తుంది” అని వృద్ధ ప్రయాణికుడు పేర్కొన్నారు.ప్రజలు కోరేది ఒక్కటే – బస్టాండ్ లో ఆటో అడ్డగోలు పార్కింగ్ నియంత్రణ, బస్సుల సౌకర్యంగా రాకపోకలు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








