నిజామాబాద్ జిల్లా, బోధన్:బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద కల్తీ మత్తుపదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ అవగాహన సదస్సులో నిజామాబాద్ నుండి వచ్చిన ఏసీబీ సార్ఎసిపి శ్రీనివాస్, సీఐ వెంకట్ నారాయణ, బోధన్ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
‘కల్తీ కళ్ళు వద్దు – మంచి జీవితమే ముద్దు’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు కల్తీ మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాల గురించి వివరిస్తూ యువతను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు.
అవగాహన కార్యక్రమానికి స్థానికులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అధికారులు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ, కల్తీ డ్రగ్స్ను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








