V1News Telangana

నీట్ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి లేకపోవడం — కన్నీటి మడుగులో ముగ్గురు విద్యార్థులు

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని జూనియర్ మరియు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన NEET (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు తక్కువ సమయంలో ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను పరీక్ష కేంద్ర అధికారులు అనుమతించలేదు. పరీక్షకు ప్రవేశం సమయంలో కఠిన నియమాలు అమలు చేయడంతో, నిబంధనల ప్రకారం గేట్లు మూసిన అనంతరం వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆలస్యం కావడంతో పరీక్షకు మిక్కిలి ప్రాధాన్యతనిచ్చిన విద్యార్థులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పరీక్షకు అనుమతి లభించకపోవడంతో కంటతడి పెట్టారు. ఎంతో కాలంగా చదివి, ఓ సీటు కోసం ఆశపడ్డ విద్యార్థులకు ఎదురైన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పలువురు తల్లిదండ్రులు మరియు స్థానికులు విద్యార్థుల పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు.

NEET పరీక్ష నిర్వహణలో అలాంటి కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో మానవీయతకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post