– చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు
– పోషక ఆహారం, మొర్రుపాల యొక్క ప్రాధాన్యతపై పలు సూచనలు
– మహిళా కమిషన్ స్త్రీల పరిరక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది
– ఉమ్మడి జిల్లాల మహిళా కమిషన్ మెంబర్ సుధాం లక్ష్మి
– (DW ) జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిణి అలివేటి ప్రమీల
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల అంగన్వాడి కేంద్రం లో బుధవారం రోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి ఆధ్వర్యంలో”బాలమేళా”కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా (DW) జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిని అలివేటి ప్రమీల, ఉమ్మడి జిల్లాల మహిళా కమీషన్ మెంబర్ సుధాం లక్ష్మి పాల్గొన్నారు.మండల పరిధిలోని వివిధ గ్రామాల అంగన్వాడి సెంటర్ల టీచర్ లు , చిన్నారులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలతో ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు నిర్వహించారు .పసిపిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంతో కేరింతలు కొడుతూ ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా బంజారా సంస్కృతిలో పిల్లలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకర్షించింది.. అనంతరం DW అలివేటి ప్రమీల మాట్లాడుతూ పసిపిల్లల ఎదుగుదల, పోషకాహార లోపం, బరువు పెరగకపోవడం పట్ల తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనకు స్థానికంగా విరివిగా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా పిల్లలకు అందించడం వలన అధిక పోషకాలు లభించి పిల్లల్లో ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు. పిల్లలకు, గర్భిణీలకు అందించే పోషక పదార్థాల గురించి పలు సూచనలు చేశారు. పోషక పదార్థాలు తీసుకోవడం వలన సాధారణ ప్రసవాలు జరుగుతాయని , ముర్రు పాల యొక్క విశిష్టతను వివరించారు.వచ్చే సంవత్సరం అంగన్వాడి కేంద్రంలో ఇప్పటివరకు చదువుకున్న ఐదు సంవత్సరాలు వయస్సు నిండిన పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపించే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల మహిళా కమిషన్ మెంబర్ సుధాం లక్ష్మీ మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళా కమిషన్ ఏర్పడిందని అన్నారు. చాలా చోట్ల ఇప్పటికి కూడా మహిళలు అణచివేతకు, అఘాయిత్యాలకు గురవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలామంది మహిళలు భయభ్రాంతులకు గురై మహిళా కమిషన్ ను ఆశ్రయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ మహిళల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని వారిని రక్షించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళల పట్ల సానుభూతితో పొరుగువారు మహిళా కమిషన్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామని అన్నారు. మహిళలందరూ విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. క్లిష్ట పరిస్థితులలో ధైర్యం కోల్పోయి ఎటువంటి అఘా యిత్యాలకు పాల్పడవద్దని.. తాము అండగా ఉంటామని భరోసా అందించారు. అంగన్వాడి టీచర్ లు గర్భిణీ స్త్రీలు, బాలింతలు నిత్యం అంగన్వాడి కేంద్రానికి వస్తారు కనుక వారికి మహిళా కమిషన్ పట్ల సరైన అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా మహిళలపై జరిగే దాడులను కొంతమేరకు అరికట్టడానికి వీలవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ ఆఫీస్ సూపరిండెంట్ అరుణ్ భాస్కర్ రావ్ ,ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి, ఐకెపి ఏపీఎం గంగాధర్ అంగన్వాడి టీచర్ లు గౌరమ్మ , గంగామణి,చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..